Thursday, July 17, 2025
spot_img

పహల్గామ్‌ దాడిలో సంచలన విషయాలు

Must Read

హంతక మూఠా సంతోషంతో గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు

పహల్గామ్‌ ఉగ్ర దాడి యావత్తు దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కలవరపాటుకు చేసింది. నలుగురు ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. మహిళలు, పిల్లల్ని వదిలేసి భర్తలను చంపేశారు. ఇలా 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇక ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన స్థానికులను అరెస్ట్‌ చేశారు. అలాగే సంఘటనాస్థలిలో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులను అధికారులు విచారించారు. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు తమ పని పూర్తి చేశాక.. సంతోషంతో గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు అధికారులకు వెల్లడించాడు. ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసినట్లుగా పేర్కొన్నాడు.

ఇక ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. బాట్కోట్‌ నుంచి పర్వైజ్‌ అహ్మద్‌ జోథర్‌, హిల్‌ పార్కు నుంచి బషీర్‌ అహ్మద్‌ జోథర్‌గా గుర్తించారు. బాట్కోట్‌, హిల్‌ పార్క్‌ రెండు ప్రాంతాలు కూడా పహల్గామ్‌లోనే ఉన్నాయి. విచారణలో ముగ్గురు ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారు. ఉగ్రవాదులు… లష్కరే తోయిబాతో అనుబంధంగా ఉన్న పాకిస్థాన్‌ పౌరులుగా నిర్ధారించారు. హిల్‌ పార్కులోని ఒక గుడిసెలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు. ఆహారం, లాజిస్టికల్‌ మద్దతు అందించారు. ఇక పర్వైజ్‌, బషీర్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివార) చట్టం, 1967లోని సెక్షన్‌ 19 కింద అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని దర్యాప్తు అధికారి మీడియాకు తెలిపారు.

ప్రత్యక్ష సాక్షి దర్యాప్తు సంస్థతో కీలక విషయాలు పంచుకున్నాడు. 26 మందిని చంపిన తర్వాత ముగ్గురు ఉగ్రవాదులు వెళ్లిపోతుండగా తనను ఆపారని చెప్పాడు. కల్మా పఠించమని అడిగారని.. తాను స్థానిక యాసలో మాట్లాడడంతో తనను విడిచిపెట్టేశారని పేర్కొన్నాడు. అనంతరం సంతోషంగా నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారని చెప్పుకొచ్చాడు. ఇక పర్వైజ్‌, బషీర్‌ కొండ దగ్గర నిలబడి.. ఉగ్రవాదుల వస్తువులను చూసుకున్నారని వెల్లడించాడు. కాల్పులు అయిపోయాక.. ముష్కరులు వస్తువులు తీసుకుని వెళ్లిపోయారని పేర్కొన్నాడు. ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడి చేశారు. మతం ఆధారంగా దాడి చేశారు. ముస్లిం వ్యతిరేకులను 26 మందిని చంపేశారు. అయితే ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Latest News

అమెరికాలో లయన్ గంపా నాగేశ్వర్‌రావుకు అంతర్జాతీయ పురస్కారం

లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H గవర్నర్, లయన్ గంపా నాగేశ్వర్‌రావు అంతర్జాతీయ వేదికపై ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS