Thursday, August 14, 2025
spot_img

పాకిస్థాన్ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

Must Read

‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పాక్‌ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ దళాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధం చేస్తామని తెలిపారు.

ఒక సీనియర్‌ పాక్‌ సైనికాధికారి ప్రకారం, ఈ రాకెట్‌ ఫోర్స్‌కు ప్రత్యేక కమాండ్‌ ఉంటుందని, సంప్రదాయ యుద్ధ పరిస్థితుల్లో క్షిపణుల మోహరింపుతో సంబంధించిన అన్ని అంశాలను ఇది చూసుకుంటుందని చెప్పారు. ఈ దళాన్ని ప్రత్యేకంగా భారత్‌ను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేస్తున్నట్లు ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు.

గమనార్హంగా, దీనికి ముందు రోజు షెహబాజ్‌ షరీఫ్‌ భారత్‌పై తీవ్రస్థాయి హెచ్చరికలు చేశారు. సింధు జలాల నుంచి న్యూఢిల్లీలో ఒక్క చుక్క నీరు తీసుకున్నా సహించబోమని, భారత్‌ ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించారు. ఈ జలాలు పాకిస్థాన్‌కు ప్రాణాధారమని, వీటి విషయంలో రాజీ అనే మాటే లేదని స్పష్టం చేశారు.

Latest News

జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ దుర్ఘటన

12 మందికి పైగా మృతి జమ్మూ కాశ్మీర్‌ కిష్త్వార్‌ జిల్లాలోని చాషోటి ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. మచైల్‌ మాతా యాత్ర...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS