Saturday, August 2, 2025
spot_img

మూడు ఉద్యోగాలు… ఒకే ఇంటికి

Must Read

అనంతపురం జిల్లాలో ముగ్గురు సోదరులకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు ఏకకాలంలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందడంతో స్థానికంగా ఆనందం వెల్లివిరిసింది. శుక్ర‌వారం విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో వీరు ఎంపిక కావడం గర్వకారణంగా మారింది. గుత్తికి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ దౌలా కుమారులు మహమ్మద్ అలీ, మహమ్మద్ గౌస్, మహమ్మద్ సమీర్‌లు ఇప్పటికే కొన్నేళ్లుగా ఈ ఉద్యోగాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. వారి సమర్థత, క్రమశిక్షణ, నిరంతర శ్రమకు ఫలితంగా ముగ్గురూ ఈసారి ఎంపిక కావడం విశేషం.

పోలీసు శాఖలో ఇప్పటికే పనిచేస్తున్న తండ్రి ప్రేరణతో, చిన్ననాటి నుంచే పోలీస్ జాబ్‌పై ఆసక్తి పెంచుకున్న ఈ ముగ్గురు సోదరులు తమ లక్ష్యం వైపు అచంచలంగా పయనిస్తూ చివరికి విజయాన్ని అందుకున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే కుటుంబంలో, స్నేహితుల వర్గాల్లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. వారికి అభినందనలు తెలిపేందుకు వారి నివాసానికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. “మా పిల్లలు మంచి ఉద్యోగాలు పొందడం మాకు గర్వకారణం. వారు దేశసేవలో నిబద్ధతతో ముందుకు వెళ్లాలి” అంటూ తండ్రి మహబూబ్ దౌలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరెందరో యువత తమ లక్ష్యాలవైపు ముందుకు సాగాలని పలువురు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈ కుటుంబం పోలీస్ శాఖలో ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచింది.

Latest News

రాష్ట్రాన్ని గాలికి వదిలి ఢిల్లీ రాజకీయాలకు ఎందుకు

బీసీ రిజర్వేషన్లపై డ్రామా కాదు, రాజ్యాంగబద్ధ పోరాటం జరగాలి దాసోజు, వకుళాభరణం ఆగ్రహం రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి ఢిల్లీలో రాజకీయ నాటకాలపై దృష్టి సారించడం తప్పుపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS