Tuesday, August 19, 2025
spot_img

విద్యా శాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదు

Must Read

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా విద్యాశాఖపైన నిర్లక్ష్యం చూపడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నందున ఈ రంగానికి ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. చివరి సంవత్సరం ఎన్నికలతోనే గడిచిపోతుంది. కాబట్టి మిగిలింది రెండు సంవత్సరాల సమయం మాత్రమే. ఈ వ్యవధిలోనే విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి” అని మురళి వ్యాఖ్యానించారు. ఆకునూరి మురళి మాట్లాడుతూ – “మధ్యాహ్న భోజన నాణ్యత సరైన స్థాయిలో లేదు. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మేము ఇప్పటికే నివేదిక ఇచ్చాం. భోజనం వండే స్వయం సహాయక గ్రూపుల మహిళలు తమ సొంత డబ్బుతో పెట్టుబడి పెట్టి వండిపెడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సమయానికి బిల్లులు చెల్లించక వారు అప్పులపాలవుతున్నారు” అన్నారు. “ఐదు సంవత్సరాల క్రితం ఉన్న రేట్లతోనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆ రేట్లతో వారు ఎలా బతుకుతారు? వారికి వారానికోసారి చెల్లింపులు జరగాలి. కానీ మూడు నెలలకు, ఆరు నెలలకు చెల్లిస్తే వారు ఇబ్బందులు పడతారు. మేము మూడు నెలల క్రితం విద్యాశాఖకు ఈ సూచనలతో రిపోర్టు ఇచ్చినా పట్టించుకోవడం లేదు” అని మురళి ఆవేదన వ్యక్తం చేశారు.

Latest News

42% బీసీ రిజర్వేషన్ పై రాజకీయ వివాదం

బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS