Sunday, August 3, 2025
spot_img

ఒక్క ‘సారీ’తో రూ.1600 కోట్లు

Must Read

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి సారీ చెప్పటంతో ఆయన సంపాదన ఏకంగా రూ.1600 కోట్లు పెరిగింది. ఆయన సంస్థ టెస్లా షేర్ల విలువ 0.10 శాతం పెరిగి 326.43 డాలర్లకు చేరింది. వీళ్లిద్దరి మధ్య ఇటీవల విభేదాల నేపథ్యంలో టెస్లా షేర్లు ఒక్క రోజే 14 శాతం పతనమయ్యాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ సుమారు 152 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి.

అయితే.. ఎలాన్ మస్క్ అనూహ్యంగా మెట్టు దిగారు. ట్రంప్‌పై చేసిన దూకుడు వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం (జూన్ 11న) ఉదయం ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. మస్క్ క్షమాపణలను ట్రంప్ సైతం అంగీకరించినట్లు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్ ప్రకటించింది. దీంతో మస్క్ సంస్థల షేర్లు ఇప్పుడు కాస్త పుంజుకున్నాయి. యూఎస్ గవర్నమెంట్ రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును టెస్లా అధిపతి వ్యతిరేకించటంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.

Latest News

వైశ్య వ్యాపార వేత్తల ఐక్యతకు కొత్త వేదిక – జీవీబీఎల్ ఘనంగా లోగో, వెబ్‌సైట్ ఆవిష్కరణ… ఏడు నూతన చాప్టర్ల ప్రకటన

వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్‌వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్‌లోని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS