స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
రూ.500 నోట్లను రద్దు చేయనున్నారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. అలాంటి ఆలోచనేదీ తమకు లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. రూ.500 నోట్ల రద్దుపై క్యాపిటల్ టీవీ చానల్ అప్లోడ్ చేసిన వీడియోను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా పరిశీలించి తాజా ప్రకటన చేసింది. రూ.500 నోట్ల రద్దుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి నిర్ణయాన్నీ వెలువరించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రూ.500 నోట్లు చట్టబద్ధంగానే చెలామణీలో ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని, షేర్ చేసే ముందు అఫిషియల్ సోర్స్తో చెక్ చేసుకోవాలని సూచించింది.