Wednesday, June 25, 2025
spot_img

ఆర్చరీ క్రీడాకారులకు శాప్ ఛైర్మన్ అభినందన

Must Read

ఈ నెల 15 నుంచి 20 వరకు సింగపూర్‌లో జరిగిన ఆర్చరీ ఏషియా కప్ లెగ్-2 పోటీల్లో కాంపౌండ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారుడు టి.గణేష్ మణిరత్నం, అలాగే ఇండివిడ్యువల్, మిక్సిడ్, టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్స్ సాధించిన క్రీడాకారిణి బి.షణ్ముఖి నాగసాయి విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ రవినాయుడును ఇవాళ (జూన్ 24, మంగళవారం) మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆర్చరీలో తాము సాధించిన పతకాలు, విజయాల గురించి వివరించారు. వారిని శాప్ ఛైర్మన్ అభినందించడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, దేశ ఖ్యాతిని విస్తృతం చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వోల్గా ఆర్చరీ అకాడమీ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ, ఆర్చరీ కోచ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Latest News

’రైతునేస్తం’.. విజయవంతం..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS