Sunday, June 8, 2025
spot_img

సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత

Must Read

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హిమాచల్‌ప్రదేశ్‌లో సిమ్లాలో ఉన్న ఇందిరాగాంధీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోనియాగాంధీ హాస్పిటల్‌లో చేరిన విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రధాన సలహాదారు (మీడియా) నరేష్ చౌహాన్ పేర్కొన్నారు.

స్వల్ప ఆరోగ్య సమస్యలతో రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరినట్లు స్పష్టం చేశారు. ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని తెలిపారు. సోనియాగాంధీకి ఎంఆర్ఐ పరీక్షలు జరిపినట్లు సమాచారం. 78 ఏళ్ల సోనియాగాంధీ 2025 మే 27న దివంగత ప్రధాని జవహర్‌లానెహ్రూ 61వ వర్దంతి సందర్భంగా కనిపించారు. గతంలో పలుమార్లు అస్వస్థతకు గురై మన దేశంతోపాటు విదేశాల్లోనూ వైద్యం పొందిన సంగతి తెలిసిందే.

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS