దేశవిదేశీ భక్తుల రాకతో ప్రత్యేక ఆకర్శణ
కుంభమేళా జరుగుతున్న త్రివేణీ సంగమ తీరం భక్తకోటితో నిండిపోతోంది. కనుచూపుమేర ఎటుచూసినా భక్తుల పుణ్యస్నానాలే కనిపిస్తున్నాయి.రోజూ రెండుకోట్లకు తగ్గకుండా భక్తులు వస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. విదేశీయులు సైతం కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఆధ్యాత్మిక సంగమం ఒక విశ్వ సంబరంగా...
జంటనగరాల్లో చురుకుగా వెరిఫికేషన్ ప్రక్రియ
కొత్త రేషన్ కార్డు కోసం 83వేల మంది దరఖాస్తు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ పక్రియను వేగవంతం చేస్తోంది. ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల పక్రియను మరింత...
ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు
వినీలాకాశంలో ఈ నెల 22న అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు వచ్చి కనువిందు చేయనున్నాయి. ఆయా గ్రహాలు ఎలాంటి బైనాక్యులర్ల సహాయం లేకుండానే నేరుగా చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 22వ తేదీ నుంచి 31 వరకు గ్రహాలు ఒకో వరుసలోకి రాబోతున్నాయి....
గుండె తరలింపునకు మెట్రో సంస్థ గ్రీన్కారిడార్
గుండె ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కోసం చేపట్టిన ప్రక్రియలో హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర పోషించింది. నగరంలోని ఎల్బీనగర్లో ఉన్న కామినేని ఆస్పత్రి నుంచి దాత గుండెను లక్డీకపూల్లో ఉన్న గ్లెనిగేల్స్ గ్లోబల్ ఆస్పత్రికి అత్యంత వేగంగా తరలించారు. దీని కోసం హైదరాబాద్ మెట్రో సంస్థ గ్రీన్కారిడార్ను ఏర్పాటు చేసింది....
హైదరాబాద్లో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని మనీష్గా గుర్తించారు. ఇతడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాడుగా పోలీసులు తెలిపారు. మనీష్తో బీహార్ రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు జతకట్టాడు. వారం రోజుల క్రితం నిందితుల చోరీలు మొదలు పెట్టారు. ఛత్తీస్గడ్లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి రూ. 70 లక్షల రూపాయలు మనీష్...
ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని వైద్యుల సలహాలు అక్షరాల నిజమని నిరూపించారు 108 సిబ్బంది. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువుకు శ్వాస ఇబ్బందులు తలెత్తాయి. వైద్యుల సూచన మేరకు వెంటనే చిన్నారిని 108 అంబులెన్స్లో హైదరాబాద్కు తరలిస్తుండగా చిన్నారి గుండె ఆగిపోయింది. వెంటనే స్పందించిన 108 సిబ్బంది...
తెలంగాణలో టీడీపికి ఇంకా ఎనలేని ఆదరణ ఉందని, త్వరలోనే టీడీపీకి పూర్వ వైభవం తేస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరిస్తామని, ఈ దిశగా చర్చలు జరుపుతున్నామన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా లోకేశ్...
రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ మంత్రి రామ్మోహన్ ట్వీట్
విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు.. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్...
సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడిక్కడ నిలదీయండి
బాకీలు అడిగినట్లుగా కాంగ్రెస్ నేతలను అడగండి
తులం బంగారం సహా హావిూలపై ప్రశ్నించండి
చేవెళ్లలో ఉప ఎన్నిక రావడం ఖాయం
హావిూలను అమలు చేసేదాకా నిలదీస్తూనే ఉంటా
షాబాద్ బిఆర్ఎస్ రైతు ధర్నా సభలో కెటిఆర్
కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ విమర్శించారు....