ఓటు హక్కు వినియోగించుకున్న 66మంది
25న కౌంటింగ్కు ఏర్పాట్లు
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 77.56 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. 66 మంది బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 22 మంది బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు...
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ నిమిత్తం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 250 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4గంటల వరకు ఓలింగ్ ప్రక్రియ జరిగింది.