ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష
2025-2030 మధ్య కాలంలో అమలుచేయాల్సిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ4.0పై సీఎం చంద్రబాబు ఇవాళ (జూన్ 23 సోమవారం) అమరావతిలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో నూతన విధానాన్ని రూపొందించనున్నారు.

క్లస్టర్లవారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచించనున్నారు. ఈ రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో 23 సంస్థలు రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.