రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్తో ప్రస్తుత లైసెన్సుల గడువు ముగియనుండగా, కొత్త లైసెన్సులు 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు రెండు సంవత్సరాలపాటు అమల్లో ఉండనున్నాయి. దరఖాస్తు ఫీజును ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. అలాగే, కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేయనుంది. గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఉండనున్నాయి. ఆరు స్లాబ్ల ఆధారంగా లైసెన్సులు జారీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.