Saturday, June 28, 2025
spot_img

ప్రజలకు సేవ చేయడమే కూట‌మి లక్ష్యం

Must Read

కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు

ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్‌ చేయడం వంటి సంస్కృతి మా కూటమి ప్రభుత్వానికి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. పాతపట్నంలో 265 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఉద్దానం పేజ్‌ -2 మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు.. పాతపట్నం నియోజకవర్గంలోని బూరగాం గ్రామంలో 265 కోట్ల రూపాయలతో ఉద్దానం పేజ్‌ -2 మంచినీటి పథకం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లాగా ఇసుక మాఫియా, భూధందాలు, లిక్కర్‌ విూద సొమ్ము చేసుకోవడం లేదన్నారు.. ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్‌ చేయడం వంటి సంస్కృతి కూడా మా కూటమి ప్రభుత్వానిది కాదన్నారు.. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు స్వాతంత్రం వచ్చేటట్లుగా స్వేచ్ఛగా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారని పేర్కొన్నారు..

ప్రజలు ఎవరైనా సమస్యలు పరిష్కరించుకుంటే మమ్మల్ని అక్కడికక్కడే నిలదీస్తే మేం వారిపై ఎటువంటి అధికార జులుం ప్రదర్శించకుండా.. సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడిరచారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు. మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలో ఇండియా టర్న్స్‌ పింక్‌ సంస్థ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా మహిళలకు ఉచిత బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు.. ఈ కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 10,000 మంది గ్రావిూణ మహిళలకు ఉచితంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ సదుపాయం కల్పించబడుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం మహిళలో అవగాహన పెంపొందించి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, తద్వారా జీవితాలను రక్షించడం అన్నారు..

Latest News

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS