Saturday, June 7, 2025
spot_img

భక్తిని బిజినెస్‌గా మార్చిన ఘనుడు

Must Read

రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

గతేడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఓ ఘనుడు భక్తుల విశ్వాసాన్ని బిజినెస్‌గా మార్చేశాడు. రామాలయ ప్రసాదం పంపిణీ పేరుచెప్పి లక్షలాది మంది భక్తులను మోసం చేశాడు. రూ.51కే ప్రసాదాన్ని ఇంటికి పంపిస్తామని నమ్మబలికాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకున్నాడు. దీంతో 6 లక్షల మందికి పైగా భక్తులు ఆన్‌లైన్ పేమెంట్లు చేశారు. దీంతో రూ.2.15 కోట్లు జమయ్యాయి. కానీ ఎవరికీ ప్రసాదం రాలేదు. మోసపోయామని గ్రహించిన బాధితులు అయోధ్య సైబర్ పోలీసులకు చెప్పటంతో వారు కేసు బుక్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఆశిష్ అనే నిందితుణ్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ సొమ్మును బాధితులకు తిరిగి ఇచ్చేశారు.

Latest News

కోహ్లీని అరెస్ట్ చేయాలి

ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని అరెస్ట్‌ చేయాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS