ఈయన అవినీతిపై జి.హెచ్.ఎం.సి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ దృష్టి సారించాలి
˜ అక్రమ నిర్మాణమా సున్నం వేసుకో..
˜ నాకు డబ్బులు ఇవ్వు హౌస్ నెంబర్
అసెస్మెంట్ చేసి సక్రమం చేస్తా..
˜ సూపర్ ఆఫర్ ఇస్తున్న
డీ.సీ. తిప్పర్తి యాదయ్య..
˜ ప్రభుత్వ నిషేధిత భూముల్లో
అక్రమ నిర్మాణాలకు తప్పుడు హౌస్ నంబర్లు అసెస్మెంట్..
˜ కోట్ల రూపాయల జిహెచ్ఎంసి పన్నుకు గండి కొడుతున్న డీ.సీ.!
˜ డీ.సీ. అక్రమ హౌస్ నంబర్ అసెస్మెంట్ లపై విజిలెన్స్, సీబీఐ
ఎంక్వయిరీ చేయాలని స్థానిక ప్రజల డిమాండ్..తెలంగాణ కు ఏకైక ఆదాయ మార్గం హైదరాబాద్.. ఈ మహా న గరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న తరుణం లో కొందరు అవినీతి అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి ప్రభుత్వ ఖజానాకు కోట్లు గండి కొడుతు న్నారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ వార్త కథనం..
జిహెచ్ఎంసి మహానగరంలో హెడ్ ఆఫీస్ నుండి జోనల్ స్థాయి ఆఫీసు.. జోనల్ నుండి సర్కిల్ స్థాయి ఆఫీస్ వరకు.. భారీ వాణిజ్య సముదాయాలై నా, చిన్న భవంతులైనా అక్రమ నిర్మాణం చేపడితే.. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటే కంప్లైంట్ అథా రిటీ లోకల్ బాడీ డిప్యూటీ కమిషనరే కావడం గమనార్హం.. ఈ డిప్యూటీ కమిషనర్ చర్యలు తీసుకోవాలన్నా తీసుకోవద్దు అను కున్నా ఆయన ఇష్టం.. ఒకవేళ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి జరిగినా టాక్స్ విభాగంలో అవినీతి జరిగినా, బాధ్యత వహించ వలసిన డిప్యూటీ కమిషనర్ ఆయా విభాగాల అధికా రులపై తోసేసి నాకు ఏమీ సంబంధం లేదు. అధికారులే తప్పు చేశారు. అని తప్పించుకోవడం పరిపాటిగా మారి పోయింది. ఈ విష యంపై జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కరణ్ దృష్టి సారించాలి.

టిఎస్బిపాస్ మున్సిపల్ చట్టం ప్రకారం జోనల్ కమిషనర్ ఎస్టిఎఫ్ ఇంచార్జ్ కావడం ఆయన ఎస్టిఎఫ్ టీం ఏర్పాటు చేయడం.. ఆ టీం ద్వారా అక్రమాలను పసిగట్టి చర్యలు తీసుకోవడం ఆయన పని.. కానీ ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండడంతో డిప్యూటీ కమిషనర్ పైనే ఆధారపడి పనులు పురమాయించడం.. ఆయన ను నమ్మడం ఆయన అవినీతికి పాల్పడితే ఉన్నత స్థాయి అధికారి
అని వదిలేయడం పరిపాటిగా మారిపోయింది.. ఈ విషయంపై మున్సిపల్ శాఖా మాత్యులు, సీఎం రేవంత్రెడ్డి దృష్టి సారించాలి..
హయత్నగర్ సర్వేనెంబర్ 255లో ప్రభుత్వ భూమి కబ్జా.. అక్రమ హౌస్ నెంబర్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో 118 జీవోపై రాజకీయ యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఇంచార్జ్, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఒకరి మీద ఒకరు దూషించుకుని ప్రజా శ్రేయస్సు కోసం భవిష్యత్తులో ఇక్కడ స్థలాలకు రెగ్యులరైజ్ చేయడం కోసం కష్టపడుతుంటే, రెండు సింహాలు కొట్లాడుతుంటే నక్కకు లాభం అనే విధంగా సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, స్థానిక రాజకీయ నాయకుడు ఒకరు..ఈ ఇద్దరు కుమ్మక్కైపోయి ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన నిర్మాణ అనుమతుల పన్ను తప్పుడు అసెస్మెంట్ల ద్వారా సొంత జేబుల్లోకి మరల్చుకుంటున్నారు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి.. దాదాపు ఇక్కడ ప్రభుత్వ నిషేధిత జాబితా లో ఉన్న ఆరు కాలనీలు.. ఈ ఆరు కాలనీలకు గాను సర్కిల్ 3 డిసి కమిషనర్ తిప్పర్తి యాదయ్య సొంత చట్టాన్ని ఏర్పర చుకుని, దొంగ అసెస్మెంట్లు చేసి, జిహెచ్ఎంసికి చేర వలసిన కోట్ల రూపాయల పన్ను సొంత జేబుల్లోకి మరల్చు కుం టున్నారు. దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి.. గతంలో ఈయన గారు పలు వార్త కథనాలకు స్పందించి మేయర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి ఆదేశాల మేరకు పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను గుర్తించి సీజ్ చేశారు, అవి ఈరోజు ఓపెన్ అయి పోయి కిరాయిలకు కూడా ఇచ్చేశారు.
ఇదే అదునుగా, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు ఎల్బీ నగర్ జోన్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య… ఈ విషయంపై సర్కిల్ స్థాయిలో, జోనల్ స్థాయిలో ఆర్టిఐ దరఖాస్తు ద్వారా ఎన్ని నిర్మాణాలు సీజ్ చేశారు..? ఎలా ఓపెన్ చేయ బడ్డాయి..? వాటి వివరాలు ఇవ్వండి అంటే ముఖం చాటేస్తున్నారు అధికారులు ఈ వ్యవ హారమే యాదయ్య అవి నీతికి అద్దం పడు తుంది. ఈతిప్పర్తి యాదయ్య అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఎమ్ కావాలి..?
కాగా బి.యన్ రెడ్డి నగర్ డివిజన్, సాగర్ కాంప్లెక్స్ , శ్రీనగర్ కాలనీ, రోడ్ నెంబర్ 3, ప్లాట్ నెంబర్ 7, హైవే రోడ్డును అనుకొని భారీ వాణిజ్య భవంతి అంటే అక్రమంగా ఒక హోటల్ నిర్మాణం వేయి గజాల స్థలంలో భారీగా చేపడుతున్నారు.. ఈ నిర్మాణానికి జిహెచ్ఎంసి నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారు అని మే నెల 25 వ తారీకు నాడు ఒక వార్తా కథనం వ్రాసి, సర్కిల్ 3 డి.సి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వారికి వ్రాతపూర్వక ఫిర్యాదు ద్వారా తెలియపరిచాం.. సదరు డి.సి, టౌన్ ప్లానింగ్ సిబ్బంది చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇవ్వడం జరిగింది, రోజులు గడిచాయి అక్రమ నిర్మాణం ప్రాథమిక దశ నుండి సంపూర్తి దశలోకి చేరుకుంది.. ఈ విషయాన్ని గ్రహించి మరలా జూన్ 2వ తారీఖు వార్త రాసి జోనల్ కమిషనర్ కార్యాలయానికి తెలియ పరచి వ్రాతపూర్వ ఫిర్యాదు ద్వారా టౌన్ ప్లానింగ్ సిపి, జోనల్ కమిషనర్ వారికి తెలియపరిచాం , ఈ విషయంపై జోనల్ కమి షనర్ కిందిస్థాయి డి.సిని పురమాయించడంతో తిప్పర్తి యాదయ్య సదరు నిర్మాణదారుడుతో రేటు కుదుర్చుకుని అక్రమ నిర్మాణాన్ని దగ్గరుండి ప్రోత్సహించి సున్నం వేసే వరకు సహకరించడం గమనార్హం. ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ అధికారులను వివరణ కోరితే మూడు నోటీసులు ఇచ్చాం పోలీస్ ప్రొటెక్షన్ కోసం డి.సీ అనుమతి కొరీతే అను మతి లెటర్ పై సంతకం పెట్టట్లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం..
అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్ అలాట్ చేసి, అసెస్మెంట్ ట్యాక్స్ వేసి ఇవ్వడంతో నిర్మాణం సక్రమమని చెప్పకనే చెప్పవచ్చు. ఈ విషయం కోర్టుకు వెళ్లిన సదరు అక్రమ నిర్మాణదారుడుకి స్టే ఆర్డర్ వస్తుంది.. ఇది అందరికీ తెలిసిన విషయమే…
డీ.సీ యాదయ్య అవినీతి అక్రమాలపై దృష్టి సారిస్తే వేల సంఖ్యలో ఉంటాయని చెప్పకనే చెప్పవచ్చు. హయత్ నగర్ డివిజన్ సర్వే నెం. 255 విస్తీర్ణం 74ఎకరాలు, హయాత్నగర్ అన్మగల్ గ్రామం, హయత్ నగర్ మండలం 30 ఎకరాలు అక్రమ ఆక్రమణ
దాదాపు 6 ఎకరాలు (వివిధ ప్లాట్లు) 118 లేదా 58, 59 జీఓ ల కింద క్రమబద్ధీకరించబడ్డాయి.
సర్వేనెంబర్ 255 ప్రభుత్వ భూమి కబ్జాకు గురికావడం, 58, 59 జీవో కింద రెగ్యులరైజ్ ఆయన ప్లాట్లు కాకుండా ఇంకా 30 పైగా ఇంటి నెంబర్లు అసెస్మెంట్ చేయబడ్డాయి.. ఈ స్కామ్ లో భాగంగా 100, 150 గజాల ప్లాట్లుగా మలిచి వీటికి హయత్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ నుండి ఆర్.ఐ అవినీతికి పాల్పడి తప్పుడు పత్రాలను పట్టాలుగా జారీ చేయడం ఆ పట్టాలను బేస్ చేసుకుని ఇంటి నెంబర్ ఇవ్వడం ఇదంతా ఓ ముఠా స్కెచ్.. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి తిప్పర్తి యాదయ్య అనే చెప్పకనే చెప్పవచ్చు.
ఈ అవినీతి ఆక్రమణలపై మున్సిపల్ శాఖ మాత్యులు సీఎం రేవంత్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కరణ్ దృష్టి సారించి విజిలెన్స్ ఎంక్వయిరీ కి అధికారులను పురమాయించి అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక జనం డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని ఆధారాలతో రేపటి కథనంలో..