మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం
బనకచర్ల అసలు భాగోతం ఢిల్లీ లో Anumula Revanth Reddy మాటల ద్వారా బయటపడ్డది. బనకచర్ల పై చంద్రబాబు నాయుడు తో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని గోదావరి లో 1000 టీఎంసీ లు, కృష్ణా లో 500 టీఎంసీ లు ఇస్తే చాలనే పల్లవి ని వినిపిస్తూ తెలంగాణ కు తీరని ద్రోహం తలపెట్టేందుకు సిద్ధమయ్యారని ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయి.
కేబినెట్ సమావేశం ఏర్పాటు ,చంద్రబాబు తో చర్చల ప్రతిపాదన ముందే కుదుర్చుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని స్పష్టమైంది.
కేసీఆర్ గారు గోదావరి లో తెలంగాణ కు ఇప్పటికే ఇచ్చిన జీవో ల ఆధారం గా 968 టీఎంసీ ల హక్కు కు తోడు సముద్రం లో కలుస్తున్న 3 వేల టీఎంసీ లలో 1950 టీఎంసీ ల జలాలు తెలంగాణ కు ఇవ్వాలని కోరారు.
అంటే మొత్తం 2918 టీఎంసీ లు కేసీఆర్ గారు అడిగితే రేవంత్ రెడ్డి వెయ్యి టీఎంసీ లకు మన వాటా పరిమితం చేసే కుట్ర చేస్తున్నారు.
కేసీఆర్ గారు కృష్ణా జలాల్లో 763 టీఎంసీ ల వాటా కోసం ట్రిబ్యునల్ ముందు పోరాడితే రేవంత్ రెడ్డి 500 టీఎంసీ లతో సరిపెట్టాలనుకోవడం తెలంగాణ ను నిండా ముంచడమే.

అపెక్స్ కౌన్సిల్ కు డిమాండ్ చేయకపోవడం ,చంద్రబాబు తో చర్చలు చేస్తామనడం వెనక మతలబు ఏమిటో .ఇది చంద్రబాబు కు గురుదక్షిణ గా భావించాలా ?
అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ గారు బనకచర్ల కు ఒప్పుకున్నారనే విధంగా దుష్ప్రచారం చేస్తున్న తీరును ఇప్పటికే పూర్తి ఆధారాలతో ఎండగట్టాo. మరో సారి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ లో చేసిన వాదన కాపీ ని ఇక్కడ జత పరుస్తున్నా. కృష్ణా జలాల్లో 299 టీఎంసీ లకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అదే పనిగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా .
కేసీఆర్ గారు సెక్షన్ 3 ప్రకారం కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తో కృష్ణా ట్రిబ్యునల్ ను సాధించి పెట్టారు .
బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు 763 టీఎంసీ లు తెలంగాణ కు కేటాయించాలని అఫిడవిట్ వేశాం. మన న్యాయవాదులు ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తున్నారు .రేపో మాపో మనం కోరిన విధంగా 763 టీఎంసీ ల వాటా సాధించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి .
సమైక్య రాష్ట్రం లో కాంగ్రెస్ ,టీడీపీ ల పాలనలో తెలంగాణ లో కృష్ణా నదిపై 299 టీఎంసీ ల మేరకే నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఉండటం తో అంతే వాటా మనకు పరిమితమైంది .
ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 299 టీఎంసీ లు సరిపోవనీ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన మొత్తం 811 టీఎంసీల కృష్ణా జలాల్లో సగం అంటే 405 టీఎంసీ లు తాత్కాలికంగా కేటాయించాలని డిమాండ్ చేశాo.
అడ్ హాక్ అగ్రిమెంట్ కు ఫైనల్ అవార్డుకు తెలియని సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానానికి , అవగాహనా రాహిత్యానికి చింతిస్తున్నా.