Friday, June 13, 2025
spot_img

ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పట్టణ ప్రణాళిక విభాగం

Must Read

-చైన్ మెన్ ల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాల దందా…

-చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు…ప్రభుత్వ ఆదాయానికి గండి

-అనుమతులకు మించి నిర్మిస్తే వారు అడిగినంత ఇయ్యాల్సిందే..

-మల్లంపేట్ లో చక్రం తిప్పుతున్న చైన్ మెన్ పై చర్యలు ఎప్పుడు..?

-దుండిగల్ టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ దృష్టి సారించాలని స్థానికుల డిమాండ్…

దుండిగల్ పట్టణ ప్రణాళిక విభాగం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మగా తయారయ్యింది.వారి ఇచ్చిందే అనుమతి,వారికి కట్టిందే ప్రభుత్వ టాక్స్ గా ఇక్కడి వ్యవస్థ కొనసాగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విభాగాన్ని అధికారులే తమ సొంత లాభం కోసం నిర్వీర్యం చేస్తుండడం అన్నం పెట్టే చెయ్యికి సున్నం పెట్టారనే నానుడిని గుర్తుచేస్తుంది

పట్టణ ప్రణాళిక విభాగమా అదెక్కడుంది అనే విధంగా తయారయింది దుండిగల్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ వ్యవస్థ. అక్కడ అంతా ప్రవేట్ వ్యక్తుల చేతుల్లోనే వ్యవస్థ కొనసాగుతుండడంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతుంది. ప్రభుత్వా నియమ నిబంధనలు ఇక్కడ వర్తించవు వారు ఇచ్చిందే అనుమతి,వారికి కట్టిందే టాక్స్… ప్రభుత్వ అధికారులు సైతం వారిని అడిగి నిర్ణయాలు తీసుకునే దౌర్భాగ్యమైన స్థితి నెలకొని ఉండడం ప్రభుత్వ పాలన పైన ప్రజలు విశ్వాసం కోల్పోయే విధంగా తయారయింది.
టిపిఓ సైతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అడిగి మరి నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం హాస్యాస్పదంగా ఉంది.

చైన్ మెన్ లా కనుసన్నాళ్లలో అక్రమ నిర్మాణాల దందా కొనసాగుతుండడం అందుకు అధికారులు సంపూర్ణ సహకారం అందించడతో వారి దందా మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉన్నత అధికారులకు తెలిసే అంతా యవ్వారం నడుస్తుందని అందుకే ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని తద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి పడుతుందని స్థానికులు విమర్శలు ఎక్కువ పెడుతున్నారు.అనుమతులకు మించి నిర్మిస్తే వారు అడిగినంత ఇయాల్సిందే లేదంటే నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురిచేసి ముక్కుపుండి మరియు వసూలు చేస్తున్నారని నిర్మాణదారులు బెంబలెత్తిపోతున్నారు. దుండిగల్ టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్న అవినీతిపై ఏసిపి దృష్టి సారించి వారి ఆటలు కట్టించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.విధి నిర్వహణలో అలసత్వం వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి నిర్మిస్తున్న నిర్మాణాలను ప్రోత్సహిస్తు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

చైన్ మెన్ సతీష్ పై చర్యలు ఎప్పుడు?

దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట లో అనుమతులకు విరుద్ధంగా విచ్చలవిడిగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి.టీఎస్ బిపాస్ అనుమతులు పొంది నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు నిర్మిస్తున్నారు. గతంలో అధికారులు కొన్నిటిని నామమాత్రపుగా కూల్చి మామ అనిపించారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలకు నోటీసులు జారీ చేయడం తూ తూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టడం ఆపై నిర్మాణాలు పూర్తి చేసుకునే వెసులుబాటు సైతం కల్పించడం అధికారులకు పరిపాటిగా మారింది. ఇక్కడ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న చైన్ మెన్ సతీష్ కుమార్ కనుసన్నాల్లోనే ఈ తతంగం అంతా కొనసాగుతుండడం అందుకు అధికారుల సంపూర్ణ సహకారం లభిస్తుందనడం బహిరంగ రహస్యమే. ఉన్నతాధికారులు ఇతగాడి ఆగడాలను కట్టడి చేయాలని లేనియెడల ప్రభుత్వ ఆదాయంతో పాటు ప్రభుత్వ పాలనపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లె ప్రమాదం పొంచి ఉందని ఇలాంటి వ్యక్తులపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నిర్మాణాలపై వివరణ కోరగా స్పందించని టీపిఓ సంజునా

దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ లో అనుమతికి మించి, ప్రభుత్వ నిబంధనలకు వెతిరేకంగా నిర్మాణంలో వున్నా భవనాల తో పాటు గతం లో తమరి కార్యాలయం ద్వార కూల్చివేతలు చేసిన భావనలు తిరిగి నిర్మాణం పూర్తి చేసుకున్న వాటిపైన తమరు తీసుకున్న చేర్యల విషయం పై తమరి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్ కోరగా దుండిగల్ టిపిఓ సంజునా స్పందించలేదు.

Latest News

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 266 పోస్టులు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌(NICL)లో 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఇందులో జనరలిస్ట్ ఖాళీలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS