అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా ఇవాళ (జూన్ 19 గురువారం) కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో జలయోగా నిర్వహించారు. ఇందులో సుమారు 150 మంది యోగా సాధకులు పాలుపంచుకున్నారు. ఈ ప్రదేశంలో నిత్యం జలయోగా చేస్తున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ చెప్పినట్లు కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. వీరికి గుర్తింపు ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో జల యోగాను ప్రమోట్ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని వివరించారు. జల యోగాలో వికలాంగులు, పిల్లలు, వృద్ధులు కూడా పాల్గొనటం గమనార్హం. యోగా చేస్తే అనారోగ్య సమస్యలను అధిగమించొచ్చని అన్నారు.





