Thursday, October 16, 2025
spot_img

సెంట్రల్‌ యూనివర్సిటీ భూములు విక్రయిస్తే ఊరుకోం : ఆర్‌.కృష్ణయ్య

Must Read

సెంట్రల్‌ యూనివర్సిటీ భూములను విక్రయిస్తే అడ్డుకుంటామని రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహించే వేలంలో ఎవరూ పాల్గొనవద్దని, ఆ భూములను కొనుగోలు చేస్తే అందులో అడుగుపెట్టనీయబోమన్నారు. భూముల విక్రయంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామన్నారు. భూముల విక్రయాలను ఆపకపోతే ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాచిగూడలోని ఓ హోటల్‌లో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. గచ్చిబౌలిలో సెంట్రల్‌ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్‌, ఓయూ జేఏసీ చైర్మన్‌ రాజు, బీసీ సంఘాల నేతలు కోల జనార్దన్‌, నందగోపాల్‌, ఉదయ్‌, చెరుకు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This