Sunday, July 20, 2025
spot_img

ముంబైపై ‘పంజా’బ్ పైచేయి

Must Read

ఐపీఎల్‌-18లో పంజాబ్ కింగ్స్ జట్టు పదేళ్ల గ్యాప్ తర్వాత ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అయింది. అదే ఉత్సాహంతో క్వాలిఫయర్ ఆడే ఛాన్స్‌నూ కొట్టేసి ఏకంగా టాప్-2లో బెర్త్ ఖరారు చేసుకుంది. లేటెస్ట్‌గా ముంబై ఇండియన్స్‌పై విక్టరీతో 19 పాయింట్లు సాధించింది. తద్వారా టాప్‌లోకి వచ్చేసింది. సోమవారం (మే 26న) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ని ఓడించింది. తొలుత ముంబై ఇండియన్స్ 7 వికెట్లు కోల్పోయి 184 రన్నులు చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలోనే టార్గెట్ చేరుకుంది. జోష్ ఇంగ్లిష్ 42 బాల్స్ ఆడి 73 రన్నులు చేశాడు. తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో ముంబై నాలుగో స్థానంలో ఉండిపోయింది. ఈ రోజు మంగళవారం రాత్రి ఏడున్నరకు చివరి లీగ్ మ్యాచ్ లక్నో, బెంగళూర్ మధ్య జరగనుంది.

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS