Thursday, September 19, 2024
spot_img

85 లక్షలు విలువ గల పొడి గంజాయి స్వాధీనం

Must Read
  • 243 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న బాలనగర్ ఎస్.ఓ.టీ పోలీసులు.
  • ఒడిషా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠా..
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

శామీర్‎పేట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా పొడి గంజాయి లభ్యమైంది.ఒడిశా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు పొడి గంజాయిని రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో సైబరాబాద్ బాలానగర్ ఎస్.ఓ.టీ బృందం,శామీర్‎పేట్ పోలీసులతో కలిసి ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో టీ.ఎస్.08 టీ 3206 గల బులెరో పికప్ వాహనాన్ని తనిఖీ చేయగా రూ.85,05,000 విలువ చేసే 243 కేజీల గంజాయి లభించింది.

గంజాయిని తరలిస్తున్న బజరంగ్ (23) ,గజేందర్ సింగ్ (26) ,నరేష్ కుమార్ చింగ్లా(40) ,కపిల్ శర్మ (28 ) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి రూ.70,000 విలువ చేసే 07 మొబైల్ ఫోన్లను,బులెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పెట్ బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This