Wednesday, September 10, 2025
spot_img

డిఫరెంట్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్

Must Read

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మూడో షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ సినిమా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం టీమ్ త్వరలో రెడీ అవుతోంది. “కిల్లర్” కు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This