Thursday, February 6, 2025
spot_img

ఆర్జే శేఖర్‌బాషాపై మరో కేసు నమోదు

Must Read

లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్‌ సాయి అరెస్ట్‌ అయి జ్యూడిషియల్‌ రిమాండ్‌కు వెళ్లారు. అలాగే బిగ్‌ బాస్‌ ఫేమ్‌, ఆర్జే శేఖర్‌ భాషాపై కూడా లావణ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. శేఖర్‌ బాషాపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. శేఖర్‌ బాషాపై కొరియోగ్రాఫర్‌ షష్టి వర్మ ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై షష్టి వర్మ గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్‌ రికార్డు లీక్‌ చేశాడని షష్టి వర్మ ఫిర్యాదులో పేర్కొంది. తన పరువుకు భంగం వాటిల్లేలా, కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌లో మాట్లాడుతున్నాడని మహిళా కొరియోగ్రాఫర్‌ క్లంపైట్‌ చేశారు. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ప్రైవేటు కాల్‌ రికార్డ్‌లు లీక్‌ చేశాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. శేఖర్‌ బాషా వ్యక్తిగత మొబైల్‌తో పాటు, అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌లు సీజ్‌ చేయాలని బాధితురాలు కోరింది. దీంతో శేఖర్‌ బాషాపై బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 79, 67, ఐటీ యాక్ట్‌ 72 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు శేఖర్‌ బాషాపై లావణ్య ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. లావణ్యను ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్‌ కేసులో ఇరికించాలని ఇటు మస్తాన్‌ సాయి, శేఖర్‌ బాషా ప్రయత్నం చేశారంటూ ఓ ఆడియో పోలీసులకు ఇవ్వడంతో శేఖర్‌ బాషాపై కేసు నమోదు అయ్యింది.

Latest News

టెట్‌ పరీక్షల్లో 83,711 మంది అభ్యర్థులు అర్హత

రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS