Saturday, October 4, 2025
spot_img

ఏపీ సీఎంగా బాద్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు

Must Read
  • ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన బాబు
  • ఐదు ఫైల్స్ పై సంతకం
  • మొదటి సంతకం మెగా డీఎస్సీ పై
  • ఎన్నికల్లో ఇచ్చిన మొదటి 05 హామీల పై తొలి సంతకం చేసిన బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాద్యతలు చేపట్టారు.జూన్ 12న (బుధవారం) ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు,ఈరోజు (గురువారం) 13న ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టారు.ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత మొత్తం 05 ఫైల్స్ పైన సంతకాలు చేశారు. మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైన,రెండో సంతకం లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,మూడో సంతకం సామాజిక పింఛన్లు రూ.4000కు పెంపు,నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ,ఐదో సంతకం నైపుణ్య గణనపై సంతకాలు చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన మొదటి 05 హామీల పై ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This