Friday, September 20, 2024
spot_img

నగరంలో వ్యభిచార ముఠాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్

Must Read

హైదరాబాద్ లో వ్యభిచార ముఠాను గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.ఇతర ప్రాంతాల నుండి యువతులను నగరానికి తీసుకోవచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన వారిలో సూర్య కుమారి అలియాస్ రాణి (38),విజయ్ శేఖర్ రెడ్డి (49), మూఖర్జీ (30) ఉన్నారు.మరో ఇద్దరు తప్పించుకునట్టు పోలీసులు తెలిపారు.జూబ్లీహీల్స్ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతునట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ బృందం ఓ హోటల్ లో దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.మరో 6 మంది మహిళలను రెస్క్యూ హోమ్ కి తరలించినట్టు పోలీసులు తెలిపారు.అరెస్ట్ అయిన వారి నుండి రూ.89,500 నగదు,రెండు కార్లు స్వాధీనం చేసుకునట్టు వెల్లడించారు.యువతులను త్రిపుర‌,ఏపీ,తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వ్య‌భిచారం నిర్వహిస్తునట్టు పోలీసుల విచారణలో తేలింది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This