Thursday, September 19, 2024
spot_img

టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2024 ఫలితాలు విడుదల

Must Read

టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2024 ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. మధ్యాహ్నం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్‌ కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలలను వెబ్‌సైట్‌ లింక్‌లో అందుబాటులో ఉంచారు. లాసెట్‌, పీజీఎల్‌సెట్‌కు కలిపి 20,268 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 29,258 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. లాసెట్‌ ఫలితాల్లో 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. జూన్‌ 3వ తేదీన టీఎస్‌ లాసెట్‌ పరీక్షలను నిర్వహించారు. ఉదయం 9 నుంచి 10.30 వరకు మొదటి సెషన్‌ జరిగింది. ఇక మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు రెండో సెషన్‌, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్‌ పరీక్షను నిర్వహించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This