Friday, September 20, 2024
spot_img

రేపటికి వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ

Must Read
  • ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తోలి అసెంబ్లీ సమావేశం
  • రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ
  • ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన 172 మంది ఎమ్మెల్యేలు
  • రేపు ఉదయం 10:30గంటలకు తిరిగి ప్రారంభంకానున్న అసెంబ్లీ

టీడీపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం తోలి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాణ్,జగన్ మోహన్ రెడ్డి ఇతర సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు.మొత్తంగా 172 మంది ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు.ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు.మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడింది.రేపు ఉదయం 10:30 గంటలకు
అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.మిగిలిన ఎమ్మెల్యేలు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This