Friday, September 20, 2024
spot_img

అంతర్రాష్ట్ర పార్ధి దొంగల ముఠా అరెస్టు

Must Read

హైవే పై వరుస దొంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర పార్ధి దొంగల ముఠా అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్ -జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్.
గత కొంత కాలం నుండి తెలంగాణ రాష్ట్రం లో నల్లగొండజిల్లా లోని చిట్యాల, నార్కెట్ పల్లి, కట్టంగూర్ మండలాలు, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ లలో మరియు సంగారెడ్డి జిల్లాలో NH-65 పై వాహనములు ఆపి లే-బే పై పండుకున్న వారిని రాళ్ళతో కొట్టి, వారి వద్ద నుండి బంగారం, డబ్బులు దొంగలించుకొనుచు, అదే క్రమంలో తేధి 18-05-2024 న కట్టంగుర్ PS పరిధి క్రైమ్ నంబర్ 76/2024, U/S: 302, 379 IPC R/W 34 IPC లో ఒక TATA మినీ గూడ్స్ వాహనం లో పండుకొన్న కొల్లూరి రాజవర్ధన్ తండ్రి జాన్, 32 సం//లు, నివాసం: చాట్లవానిపురం గ్రామం, పామర్రు మండలం, కృష్ణ జిల్లా, ఆంధ్ర రాష్ట్రం కు చెందిన వ్యక్తి ని కాలు చేతులు కట్టేసి కొట్టి స్క్రూ డ్రైవర్ తో చేతి కి పొడిచి విచక్షణ రహితంగా కొట్టి చంపి అతని వద్ద నుండి 14,500/- దొంగలించుకొని పారిపోయి, దారిలో పామనగుండ్ల గ్రామంలో ఒక హోండా షైన్ బైక్ ను దొంగలించుకొని మరియు ఇంటి ఆరుబయట, ఇంటిలో పండుకున్న వారి మెడ లలో నుండి బంగారం ఆభరణములు, బైక్ లు దొంగలించుచూ పోలీసులకు పెను సవాలు గా మారిన అతి క్రూరమైన నలుగురు (04) పార్ధి గ్యాంగ్ సభ్యులు గల అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఇద్దరినీ (02) జిల్లా S.P శరత్ చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు నల్గొండ-DSP శ్రీ.K.శివరాం రెడ్డి గారి పర్యవేక్షణ లో నార్కెట్ పల్లి సర్కిల్ CI  శ్రీ.K. నాగరాజు గారి ఆధ్వర్యం లో చిట్యాల SI.  D. సైదా బాబు మరియు CCS హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, కానిస్టేబుల్ లు విక్రమ్, సాయి రామ్, చిట్యాల PS హెడ్ కానిస్టేబుల్ మోహసీన్ పాషా లు కలిసి పార్ధి గ్యాంగ్ ఇద్దరు సభ్యులను రాచకొండ కమిషనరేట్ పరిధిలో ORR వద్ద అరెస్టు చేసి వారి వద్ధ నుండి రూ.17 వేల రూపాయలు నగదు, రెండు కత్తెర లు, రెండు వెండి కాళ్ళ పట్టీలు, ఒక చేతి రుమాలు మరియు టార్చ్ లైట్ ను స్వాధీనము చేసుకున్నారు.
 
నేరస్థుల వివరాలు:
A-1: అప్ప పాండ్రంగా S/o పాండ్రంగా, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: పార్ధి, Occ: కూలీ, R/o బారామతి చౌరత, ఇందాపూర్, పునా జిల్లా., మహారాష్ట్ర రాష్ట్రం.
A-2: శుభం అశోక్ @ దిల్షార్ S/o అశోక్, 25 సంవత్సరాలు, కులం: పార్ధి, Occ: అగ్రిల్., R/o సరస్వతి నగర్, ఇందాపూర్, పునా జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం, N/o దుదోవడి గ్రామం.  ఖర్జాత్ (Tq), అహ్మద్ నగర్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం. 
A-3: కాశ్మీర్ శశిపాల్ భోంస్లే @ ఖశ్మీర్, S/o శశిపాల్ భోంస్లే, వయస్సు: 32 సంవత్సరాలు, కులం: పార్ధి, Occ: కూలీ, R/o సంగుల గ్రామం, పండరీపూర్ (Tq) షోలాపూర్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం (పరారీలో ఉన్నారు)
A-4: అధేష్ అనిల్ ఖలే S/o అనిల్ ఖలే, వయస్సు 25 సంవత్సరాలు, కులం పార్ధి, Occ: మేసన్, R/o సరస్వతినగర్, ఇందాపూర్, పూణే జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం (పరారీలో ఉన్నారు)

నేరస్తుల నుండి స్వాదీనం చేసుకున్న వస్తువుల వివరాలు:
(i) స్క్రూ డ్రైవర్  –            01
(ii) కత్తెరలు     –           02
(iii) నగదు – 17,000/- రూపాయలు
(iv) ఒక జత వెండి పట్టీలు 
(v) టార్చ్ లైట్   –           01

పార్ధి గ్యాంగ్ యొక్క యూనిట్ వారీ క్రైమ్ వివరాలు:
1. నల్గొండ జిల్లా: 06
2. రాచకొండ కమిషనరేట్: 13
3. సంగారెడ్డి జిల్లా: 11
4. సైబరాబాద్ కమీషనరేట్ : 02
    (శంషాబాద్
మొత్తం 32 కేసులు

వివరాలు Head wise crimes
లాభం కోసం హత్య : 01
దోపిడీ : 06
చైన్ స్నాచింగ్  : 07 
బైక్ దొంగతనం : 08
హౌస్ బ్రేక్ బై డే & రాత్రి    :  10
మొత్తం : 32 కేసులు

నేరస్తులు  నేరం చేయు విధానం (MO) :
పై నేరస్తులు ముఠాగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండజిల్లా లోని చిట్యాల, నార్కెట్ పల్లి, కట్టంగూర్ మండలాలు, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ లలో మరియు సంగారెడ్డి జిల్లాలో NH-65 పై వాహనములు ఆపి  లే-బే పై పడుకున్న వారిని రాళ్ళతో కొట్టి, భయ బ్రాంతులకు గురి చేసి వారి వద్ద నుండి బంగారం, డబ్బులు దొంగలించుకొనుచు, ఇంటి ఆరుబయట మరియు ఇంటిలో పండుకున్న వారి మెడ లలో నుండి బంగారం వస్తువులు దొంగలించుకొనుచు, మరియు రహదారి వెంట వాహనములు ఆపుకొని పండుకొన్న వారి ని రాళ్ళు, స్క్రూ డ్రైవర్ లతో కొట్టి వారి వద్ద నుండి డబ్బులు, బంగారం దొంగలించుకొనుచు, ఎవరైనా ప్రతఘటింనచో వారిని విచక్షణ రహితంగా కొట్టి చంపుతారు. ఇంటి ముందు, పార్కింగ్ ఏరియలలో పార్క్ చేసిన బైక్ లు కూడా దొంగలించుచూ అట్టి వాహనముల పై ఇద్దరు, లేక ముగ్గురు తిరుగుచూ దొంగతనాలు చేస్తూ అట్టిబైక్ లను ఊరి బయట లేక రద్దీ ప్రదేశాలలో వదిలి వేస్తారు. తేదీ 05-07-2024 రోజున అట్టి పార్ధి సభ్యుల కదిలికలని పసికట్టిన నల్లగొండ జిల్లా పోలీస్ సిబ్బంధి తో కలిసి సంయుక్తంగా వారిని వెంబడించే సమయంలో, పోలీస్ వారిని చూసిన పార్ధి గ్యాంగ్ కు చెందిన ఇద్దరు దొంగలు ఒక TATA ACE వాహనం ఎక్కి వెళ్ళుచుండగా వారిని వెంబడించి, సుమారు 0900 గంటల సమయంలో వారు హయత్నగర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గల సంపూర్ణ హోటల్ ఎదురుగా గల ఔటర్ రింగ్ రోడ్డు సర్విస్ రోడ్డు వద్ద వారు TATA ACE వాహనం ను ఆపి, వాహనం దిగి పోలీస్ లను చూసి పారిపోవుటకు ప్రయత్నించు చుండగా, పోలీస్ లు వారిని అరెస్ట్ చేయుటకు ప్రయత్నించగా, అట్టి ఇద్దరు వ్యక్తులు వారి వద్దగల స్క్రూ డ్రైవర్ మరియు కత్తెరల తో పోలీస్ వారిపై దాడి చేసి పోలీస్ లను చంపుటకు ప్రయత్నించినారు, పోలీస్ వారు, వారిని లొంగిపొమ్మని చెప్పిన వినకుండా పోలీస్ వారిపై దాడిచేయుచుండగా, ఆప్పుడు పోలీస్ వారు రక్షణ కోసం వారి వద్దగల పిస్టల్ తో రెండు సార్లు గాలిలో కాల్పులు జరిపి, వారిద్దరినీ చాకచక్యముగా పట్టుకొని, వారిని అక్కడి నుండి చిట్యాల, నల్లగొండ జిల్లా కు తీసుకొని వచ్చి, నార్కెట్ పల్లి CI గారికి అప్పగించినారు.  ఇట్టి సంఘటనలో వారి దాడిలో విక్రమ్ శంకర్ కానిస్టేబుల్ కుడి మణీకట్టు పైభాగంలో గాయం అయి, ఉంగరపు వేలు విరిగినధి.  వారిద్దని విచారించగా, వారు మొత్తం నలుగురు పార్ధి గ్యాంగ్ ముఠా కలిసి నల్లగొండ, హైదరాబాద్,  సైబరాబాద్  మరియు రాచకొండ ఏరియా లలో మొత్తం 32 కేసులలో నేరం అంగీకరించినారు.  

             ఇట్టి కేసులను చేధించుటలో ప్రతిభ కనిపించిన పోలీస్ అధికారులైన శ్రీ K. శివరాం రెడ్డి DSP, నల్గొండ, శ్రీ N. నాగరాజు CI, నార్కెట్ పల్లి, శ్రీ D. సైదాబాబు SI, చిట్యాల మరియు సిబ్బంధి విష్ణువర్ధన గిరి, HC, CCS నల్గొండ, మోహసీన్ పాషా, HC చిట్యాల, ARPC లు P. విక్రమ్ శంకర్,  R. సాయి రామ్ మరియు MD. కలీమ్, S. సాయికుమార్ PC లను SP గారు అభినంధించినా

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This