Tuesday, October 21, 2025
spot_img

మొట్టమొదటి మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ‘మై ఐటీ రిటర్న్’

Must Read

భారతీయులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ లను దాఖలు చేయడాన్ని స్కోరిడోవ్ సులభతరం చేసింది. www.myITreturn.com వెనుక ఉన్న వినూత్న శక్తి విప్లవాత్మకం గా రూపొందించిన సరికొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించడం పట్ల ఉత్సాహంగా ఉంది.ఈ వినూత్న యాప్ భారతదేశంలోనే మొట్టమొదటిదని పేర్కొంది.వినియోగదారులు ఎలాంటి భౌతిక పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా వారి స్మార్ట్‌ ఫోన్‌ల నుండి నేరుగా పన్నులను ఫైల్ చేయడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించిందని తెలిపింది.మునుపటి కంటే వేగంగా, మరింత సమర్థవంతంగా ఈ యాప్ పనిచేస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.ఈ యాప్ పన్ను రిటర్న్ ఫైలింగ్‌ను నిర్వహించే విధానాన్ని మారుస్తుందని తెలిపారు.ఈ యాప్ వినియోగదారుని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిందిరాతపని ఇబ్బందులను తొలగిస్తుంది.స్మార్ట్‌ ఫోన్‌లో కేవలం కొన్ని ట్యాప్‌లతో,తమ ఇల్లు లేదా ఆఫీసు నుండి పన్ను రిటర్న్‌ ను పూర్తి చేయవచ్చు.స్కోరిడోవ్ వ్యవస్థాపకుడు సాకార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ సంచలనాత్మక యాప్‌ను భారతదేశానికి పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.myITreturn లో పన్ను దాఖలును సులభంగా, సురక్షితంగా, సమర్థవంతంగా చేయడమే మా లక్ష్యమని పేర్కొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This