Friday, September 20, 2024
spot_img

పట్టభద్రుల్లారా మ‌ల్ల‌న్న‌ను గెలిపించండి

Must Read
  • ఓయు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను గెలిపించుకునే బాధ్యత నిరుద్యోగులు తీసుకోవాలని కోరారు టీ.పీ.సి.సి అధికార ప్రతినిధి చనగాని దయాకర్. పట్టబద్రుల ఎన్నికల సందర్బంగా ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తుందన్నారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలు నిరుద్యోగ వ్యతిరేక పార్టీలని , అందుకే కాంగ్రెస్ పార్టీను గెలిపించుకోవాలని కోరారు.అనంతరం కొంతమంది నిరుద్యోగులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ నేతలు మెడ శ్రీనివాస్, సుమన్ గౌడ్, క్రాంతి, మోతీలాల్ నాయిక్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This