శరీరం ఫిట్నెస్ కోసం చాల మంది రన్నింగ్ చేస్తుంటారు.ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి పార్కులు,ఫుట్ పాత్,గ్రౌండ్స్ లో పరుగులు పెడతారు.ఆరోగ్యానికి రన్నింగ్ చేయడం మంచిదే.రన్నింగ్ చేయడం వల్ల గుండె,ఆరోగ్యానికి చాల ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రతిరోజు 20 లేదా 30 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం చాల అవసరం.కానీ రన్నింగ్ పూర్తీ చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలని అంటున్నారు వైద్య నిపుణులు.అదేంటో మనం కూడా తెలుసుకుందాం..
రన్నింగ్ చేసిన వెంటనే చాల మంది కూర్చోవడం,విశ్రాంతి తీసుకోవడం చేస్తుంటారు.కానీ ఇలా చేయొద్దు అని అంటున్నారు వైద్య నిపుణులు.రన్నింగ్ చేసిన తర్వాత హృదయ స్పందన వేగం పెరుగుతుంది.మళ్ళీ సాధారణ స్థాయికి రావడం కోసం కొంత సమయం పడుతుంది.కాబట్టి రన్నింగ్ చేసిన వెంటనే పడుకోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం వల్ల గుండెకు సంభందించిన వ్యాధులకు గురయ్యే అవకాశముందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.రన్నింగ్ చేసి వచ్చిన వెంటనే కాసేపు ఆగి మంచి నీరు కూడా తీసుకోవడం చాల అవసరం.