Friday, July 4, 2025
spot_img

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్,09 మంది మావోయిస్టులు మృతి

Must Read

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం దంతేవాడలో భద్రత బలగాలకు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో 09 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.నిఘావర్గాల సమాచారం మేరకు దంతేవడా-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి.ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో 09 మంది మావోలు మృతిచెందారని అధికారులు వెల్లడించారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.ఘటన స్థలంలో భద్రత బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు డిఆర్జీ (drg) బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయని బస్టర్ రేంజ్ పోలీస్ ఇన్స్ పెక్టర్ జనరల్ సుందర రాజ్ తెలిపారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS