Monday, August 18, 2025
spot_img

పది రూపాయల సాయం చేసి..పుణ్యం కట్టుకో

Must Read

రెండు తెలుగు రాష్ట్రాలు విపత్తు వల్ల అల్లాడిపోతూ 05 రోజులైనా అన్నామో రామచంద్ర అంటున్నాయి..
ఎన్నో కుటుంబాలు బురదలోనే ఉన్న రాజకీయ నాయకులు మాత్రం బురద జల్లుకుంటూనే ఉన్నారు..
మంత్రులుగా,ఎంపీలుగా,ఎమ్మెల్యేలుగా అవినీతి ద్వారా కోట్లకు పడగలెత్తిన లీడర్లు..వరదలకు జీవితాలు ఛిద్రమైన వారిని
చూసి అయ్యో పాపం అన్నట్లే..”పిల్లికి బిచ్చం పెట్టారు” అన్నట్టు జేబులోకెళ్ళి రూపాయి బిల్లా బయటకు తీయట్లే..
ఒట్టి చేతులతో పుట్టిన నువ్వు..చివరకు మట్టిలో కలిసిపోతావనేది మరువకు..
ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే నీ పేరు కలకాలం పదిలంగా ఉంటుంది..
బహుళ అంతస్తుల్లో ఉంటూ ఖద్దర్ చొక్కా వేసుకొని కాస్ట్లీ కారుల్లో తిరుగుతున్నా నువ్వు..
వర్షాలకు పంట కొట్టుకుపోయి బిక్కుబిక్కుమంటూ రైతు,
వరదలకు సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుపేదోడి వైపు చూసి..
నీవు ఇంతకాలం చేసిన పాపాలకు ప్రాయచ్చితంగా పది రూపాయల సాయం చేసి..పుణ్యం కట్టుకో

  • సురేందర్ సీహెచ్
Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS