Thursday, September 19, 2024
spot_img

“భలే ఉన్నాడే” సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు

Must Read
  • డైరెక్టర్ మారుతి

యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘భలే ఉన్నాడే’ తో టీమ్ అంతా ఏడాదిన్నరగా జర్నీ అవుతున్నారు. ఈ సినిమాతో అందరికీ ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఎక్సైట్ మెంట్ తో అందరూ వర్క్ చేశారు. ఈ సినిమాతో ఒక కొత్త టీం స్క్రీన్ మీదకు రావడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గా శివ సాయి, హీరోయిన్ గా మనీషా, ప్రొడ్యూసర్ గా కిరణ్, ఇలా కొత్త టీం పరిచయం అవుతున్నారు. డెఫినెట్ గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. ఎప్పుడో వచ్చిన ఒక థాట్ ని సాయికి చెప్తే దాన్ని చాలా అద్భుతంగా మలిచి ఈ సినిమాని చేశాడు. ఇలాంటి పాయింట్ ని ఫ్యామిలీ అంతా చూసే విధంగా మలిచాడు. నేను సలహాలు ఇవ్వడం వరకే గాని నిజానికి కష్టపడిందంతా టీమే. నిర్మాతలు చాలా ఇష్టంతో ఈ సినిమా చేశారు. చాలా మంచి టీం ఇది. వీళ్ళ కష్టానికి తగిన ఫలితం మంచి హిట్ ద్వారా వస్తుందని బలంగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో కథ మాటలు సాంగ్స్ డైలాగ్స్ ఎమోషన్స్ అన్ని పక్కాగా కుదిరాయి. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ లో ఈ ప్రాబ్లం ఉంది. దీన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే విధంగా డైరెక్టర్ సాయి చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. ఆడియోస్ అందరికీ థాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండ. మీరు ఎంకరేజ్ చేస్తేనే ఒక కొత్త టీం కి ఉత్సాహంగా ఉంటుంది. నేను ఈ రోజుల్లో సినిమాతో ఎలా అయితే వచ్చానో ఈ టీం కూడా అలా ముందుకు రావాలని కోరుకుంటున్నా ను. ఈ ఈవెంట్ కు వచ్చిన అందరికీ పేరుపేరునా థాంక్స్. ఈ సినిమా చూడండి. ప్రీమియర్స్ కూడా ఉంటాయి. 13వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్ తో వెళ్లి చూడండి. రాజ్ తరుణ్ సినిమాని చాలా కష్టపడి చేశాడు. ఈ టీమ్ అందరినీ ఎంకరేజ్ చేయండి. అందరికీ థాంక్యు సో మచ్’ అన్నారు.హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఉయ్యాల జంపాల తర్వాత నేను కలిసిన ఫస్ట్ సెలబ్రెటీ మారుతి గారు. అప్పట్నుంచి ఆయన నాతో ఒక సినిమా చేయాలని చెబుతుండేవారు. ఆ సినిమా భలే ఉన్నాడే కావడం నా అదృష్టం. మారుతి గారికి థాంక్యూ వెరీ మచ్. మా నిర్మాత కిరణ్ గారు మమ్మల్ని బలంగా నమ్మారు. చాలా పాజిటివ్ పర్సన్. శేఖర్ చంద్ర తో ఇది నా మూడో సినిమా. మరో 30 సినిమాలు మా ఇద్దరం కలిసి చేయాలనీ కోరుకుంటున్నాం. నగేష్ గ్రేట్ సినిమాటోగ్రాఫర్. తనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మా డైరెక్టర్ శివ సాయి మా సినిమాకి అతి ముఖ్యమైన వ్యక్తి. మారుతి గారు పాయింట్ చెప్పిన దగ్గర నుంచి సినిమా తప్పితే మరో ఆలోచన లేదు. సాయి పని రాక్షసుడు. చాలా గ్రేట్ కన్వెన్షన్ ఉన్న డైరెక్టర్ తను. చాలా అందంగా తీశాడు. ఆయనలో ఉన్న సంస్కారం సినిమాలో కనిపిస్తుంది. నన్ను అంత కొత్తగా చూపించినందుకు డైరెక్టర్ సాయికి థాంక్యూ వెరీ మచ్. అభిరామి గారితో కలిసి పని చేయడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఈ సినిమా చేసినందుకు అభిరామ్ గారికి థాంక్యూ. మనిషా చాలా హార్డ్ వర్క్ చేసింది. తెలుగు రానప్పటికీ కష్టపడి నేర్చుకుని డబ్బింగ్ చెప్పింది. తను అమేజింగ్ కోస్టర్. సింగీతం గారితో కలిసి పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. సెప్టెంబర్ 13న మా సినిమా రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. అందరూ థియేటర్లోనే సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థాంక్యూ’ అన్నారు.హీరోయిన్ మనీషా కంద్కూర్ మాట్లాడుతూ.. నన్ను బిలివ్ చేసి ఈ అవకాశం చేసిన మారుతి గారికి థాంక్ యూ. శివసాయి చాలా ఫ్యాషనేట్ డైరెక్టర్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. రాజ్ తరుణ్ మూవీ అంత చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. మా కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. డిఓపి ప్రతి షాట్, సీన్ అదరగొట్టారు. శేఖర్ గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. చాలా కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇది. నా క్యారెక్టర్ చాలా బబ్లీగా ఉంటుంది. ఇందులో చేసిన కృష్ణ క్యారెక్టర్ నాకు అప్పటికీ గుర్తుండిపోతుంది. డెఫినెట్ గా సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This