Tuesday, October 14, 2025
spot_img

రాంపురలోని చారిత్రాత్మకమైన అనవాళ్లను కాపాడుకోవాలి

Must Read

-పురావస్తు పరిశోధకులు డా.ఈమని శివనాగిరెడ్డి

కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని రాంపూరలో విజయనగర కాలం నాటి చారిత్రాత్మకమైన అనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకులు,ప్లీచ్ ఇండియా,సీఈఓ,డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు.శుక్రవారం రాంపుర గ్రామానికి చెందిన దేవత కృష్ణ ప్రసాద్ ఆహ్వానం మేరకు, ప్రముఖ వారసత్వ పరిరక్షణ ఆర్కిటెక్ట్ బోయపాటి శరత్ చంద్రతో కలిసి రాంపూర చారిత్రాత్మకమైన ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

పచ్చటి పొలాల మధ్య,సుందరతర కావేరి తీరంలో సంస్కృతి,సాంప్రదాయాలకు నిలయమైన రాంపూరలోని పురాతన దేవాలయాలను కాపాడుతున్న కృష్ణ ప్రసాద్ వివరాలను అందిచారని తెలిపారు.

కావేరీ తీరంలోని సు ప్రసిద్ధ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం సమీప గ్రామమైన రాంపురలో క్రీ.శ.16వ శతాబ్దికి చెందిన మూడు వీరగల్లులు,ఒక సతికల్లు,9 అడుగుల ఎత్తున్న వీరాంజనేయ,బాలాంజనేయ విగ్రహాలు,కావేరీ నదిలో బండరాళ్లకు చెక్కిన సిద్ధి వినాయక శిల్పం,శివలింగం,ఎదురుగా ప్రతిష్టించిన నంది విగ్రహం,విజయనగర కాలంలో గ్రామం ప్రముఖ స్థావరంగా వెలిసిందని అన్నారు.

కావేరి నదిలోను,ఒడ్డున,ఆలయ నిర్మాణానికి,శిల్పాలు చెక్కడానికి కావాల్సిన రాతిని తీసిన క్వారీలను,రాతిని విడగొట్టడానికి గూటాలు దింపటానికి చెక్కిన ఆనవాళ్లను శివనాగిరెడ్డి గుర్తించారు.ఇంకా రామాయణ కాలపు గౌతమ మహర్షి నివాస స్థావరం,స్నాన ఘట్టాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది,శ్రీరంగపట్నం పర్యాటకులను రాంపూరకు రప్పించవచ్చని అన్నారు.

ఇప్పటికి చెక్కుచెదరని వందేళ్లనాటి ఇళ్లకు కొద్దిపాటి మరమత్తులు చేసి,ఆతిథ్య రంగంలో స్థానికులకు శిక్షణ ఇచ్చి,పెయిగ్ గెస్ట్ ఎకామిడేషన్ సౌకర్యం కల్పించి,రాంపురను వారసత్వ, తీర్థయాత్ర,గ్రామీణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This