Wednesday, May 21, 2025
spot_img

బీజేపీ సభ్యత్వాలు నమోదులో బౌద్ద నగర్ డివిజన్ ముందు వరుసలో ఉంది

Must Read
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్

బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్ బౌద్ద నగర్ డివిజన్‎లోని పలు బస్తీల్లో పర్యటించి,వ్యాపారవేత్తలతో ఆన్లైన్ ద్వారా బీజేపీ పార్టీలో సభ్యులుగా చేర్పించడం జరిగింది.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,బౌద్దనగర్ డివిజన్‎లో బూత్ కమిటీ సభ్యులు,సీనియర్ నాయకులతో కలిసి పదివేల మందిని పార్టీలో చేర్పించే దిశగా ప్రయత్నిస్తానని తెలిపారు.బీజేపీ సభ్యత్వాలు నమోదు చేయించడంలో బౌద్ద నగర్ డివిజన్ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు.క్రియాశీల సభ్యులను కూడా అత్యధికంగా పార్టీలో చేర్పిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో దత్తు,నేతి సత్యనారాయణ,ఎన్.ఎస్.అజయ్,చిలకల సురేష్,సిహెచ్ వేణుగోపాల్,ఎం.వి.లక్ష్మణ్,బైరి సురేష్,గజరాజు పాల్,పవన్ నాయుడు,తదితరులు పాల్గొన్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS