Tuesday, April 8, 2025
spot_img

డీజే శబ్ధాలు శృతిమించాయి,కట్టడి చేయాల్సిందే

Must Read
  • మతపరమైన ర్యాలీల్లో డీజే వాడకంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం

డీజే శబ్ధాలు శృతిమించిపోతున్నాయని, వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సీపీ ఆనంద్ తెలిపారు. గురువారం మతపరమైన ర్యాలీల్లో డీజేల వినియోగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, మత సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సంధర్బంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, డీజే శబ్ధాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, డీజే శబ్ధాలు ఈసారి శృతిమించాయని అన్నారు. విపరీతమైన శబ్ధాల వల్ల నివాసాల్లో వయసు మీరిన వారు ఇబ్బంది పడుతున్నరని తెలిపారు. డీజే శబ్ధాలపై అనేక ఫిర్యాదులు రావడంతో అన్నీ వర్గాలతో సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అందరి అభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక సమార్పిస్తామని వెల్లడించారు.

Latest News

పోలీసులపైకి దూసుకొచ్చిరన లారీ

ప్రమాదంలో హోంగార్డు మృతి మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS