Friday, October 3, 2025
spot_img

ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది

Must Read
  • ఎంపీ ఈటల రాజేందర్

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజ్‎గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకెఆర్ కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు హైడ్రా,మూసీ పేరుతో కొత్త నాటకాలకు తెర లేపారని అన్నారు. కేవలం ఆరు నెలల్లోనే రేవంత్ రెడ్డి దుర్బుద్ది బయటపడిందని వ్యాఖ్యనించారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ బ్యూటిఫికేషన్ చేస్తాననేది కేవలం డబ్బు సంచులు నింపుకోవడానికేనని విమర్శించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This