Friday, October 3, 2025
spot_img

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‎పై హైకోర్టు తీర్పు

Must Read

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత పై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‎కు హైకోర్టు సూచించింది. పదో షెడ్యూల్ ప్రకారం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని అనర్హత పిటిషన్‎లపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీజే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కెపి. వివేకానంద్ వారిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This