Friday, September 20, 2024
spot_img

కాంగ్రెస్ ప్రభుత్వంలో వెయ్యి కోట్ల స్కామ్

Must Read
  • అధికారంలోకి రాగానే స్కామ్ లకు తెరలేపారు
  • సన్నబియ్యం కొనుగోళ్లలో అక్రమాలు
  • గ్లోబల్ టెండర్ల పేరుతో కాంగ్రెస్‌ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణ
  • గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్లుగా పరిస్థితి
  • జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ
  • బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్‌ అంటే స్కామ్‌లు
  • రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా జరుగుతుందని, అయితే ఈ విషయాన్ని తాను ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండే చెప్పుకుంటు వస్తున్నాని గుర్తుచేశారు. గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్లుగా పరిస్థితి తయారైందని, రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థులు తినే అన్నం వరకు అన్నిటి మీద కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని విమర్శించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ 15 రోజుల కిందటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్దిష్ట ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. అయిన ఈ విషయం పై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. వారం రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఈ ఆరోప‌ణలను ఆధారాలతో సహా బయటపెట్టారని వెల్లడించారు. ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో అలా అవినీతికి తెరలేపిందని, 50 రోజుల్లోనే దాదాపు వెయ్యి కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సన్నబియ్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు గ్లోబల్ టెండర్లు పిలవడం వెనక అధికార పార్టీ అవినీతి దాగుందని కేటీఆర్ చెప్పారు. ఒకేరోజులో గైడ్ లైన్స్ జారీ చేసి అదేరోజు టెండర్లు ఆహ్వానించడం వెనక మతలబు ఇదేనని ఆరోపించారు. రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా వారిని పక్కన పెట్టి గ్లోబల్ టెండర్లు పిలిచిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రీయ బండార్ సంస్థ మనీలాండరింగ్ కు పాల్పడడంతో తమ ప్రభుత్వం బ్లాక్ చేయగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూల్స్ బ్రేక్ చేసి కేంద్రీయ బండార్ తో పాటు నాలుగు సంస్థలకు వంతపాడుతోందని విమర్శించారు. ఈ సంస్థలు రాష్ట్రంలోని 4 వేల మంది రైస్ మిల్లర్లను బెదిరింపులకు గురిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.

మధ్యాహ్న భోజన పథకం కోసం 2.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలు పేరుతో మరో కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ రెండు స్కాంలు కలిపి రూ.1100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ స్కాంలలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దల దాకా అనేకమంది హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రం కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్.సీ.ఐ కానీ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేంద్రం, ఎఫ్.సీ.ఐ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే తాము న్యాయ పోరాటానికి దిగుతామని, దోషులను ప్రజల ముందు నిలబెడతామని కేటీఆర్ చెప్పారు. ఇప్పటివరకు కుంభకోణం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ నోరువిప్పలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్‌ పార్టీ అంటే స్కామ్‌లు అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణలోని రైతాంగం కొనుగోలు కేంద్రాల వద్ద కన్నీరు పెడుతుంటే ప్రభుత్వం మాత్రం ధాన్యం కుంభకోణం పై దృష్టి పెట్టిందని విమర్శించారు. ముఖ్యమంత్రి పేషీ, పౌరసరఫరాల డిపార్ట్‌మెంట్‌ నుంచే ఈ కుంభకోణం జరిగినట్టు తన వద్ద సమాచారం ఉందని వెల్లడించారు. ప్రభుత్వం ఖజానాకు గండి కొట్టి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక వివిధ టాక్స్ ల గురించి వింటున్నామని, అయితే ఈ స్కాంల వెనుక తెలంగాణ కాంగ్రెస్ పెద్దల హస్తం కాకుండా ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందని విమర్శించారు. తమ జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారని ఆరోపించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This