Friday, September 20, 2024
spot_img

చెరువుల ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవు – ఇ.వి.డి.యం కమిషనర్ రంగనాథ్

Must Read

నగరంలోని చెరువులను అక్రమణకు పాల్పడుతూ భవన నిర్మాణాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఇ.వి.డి.యం కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఎల్. బి నగర్ పరిధిలోని ఫతుల్లా గుడా చెరువు ఆక్రమణలకు గురౌవుటున్నట్లు పలు ఫిర్యాదులు ఇ. వి. యం. డి కమిషనర్ చేరడంతో. ఈ ఫిర్యాదు లపై స్పందించిన కమిషనర్ సంబంధిత అధికారులతో కల్సి ఫతుల్లా గుడా చెరువును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం చెరువు విస్తీర్ణం ఎంత, ప్రస్తుతం చెరువు ఎంత విస్తీర్ణం వుంది. చెరువు ఏ. ఏ ప్రాంతాల్లో అక్రమణలకు గురిఅయింది. ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు. భవిష్యత్తులో ఈ ఫతుల్లా గూడా చెరువు అక్రమణలకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ అధికారులతో చర్చించారు. రాబోవు రోజుల్లో చెరువుల అక్రమణలకు పాల్పడితే కఠినతరంగా చర్యలు తీసుకోవడంపాటు, క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా కమిషనర్ అధికారులను అదేశించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This