Sunday, September 14, 2025
spot_img

అదనపు డీసీపీలకు పదోన్నతులు

Must Read

రాష్ట్రంలో 9 మంది అడిషనల్‌ డీసీపీ(ADDITIONAL DCP)లకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే ముగ్గురు డీసీపీలను బదిలీ చేసింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ డీసీపీ (స్పెషల్‌ బ్రాంచ్‌) పి.కరుణాకర్‌ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో సైబరాబాద్‌ అదనపు డీసీపీ(క్రైమ్స్‌-I)కు పదోన్నతి కల్పించారు. రాచకొండ డీసీపీ(ట్రాఫిక్‌) కె.మనోహర్‌ను రాచకొండ డీసీపీ (రోడ్‌ సేఫ్టీ)కి బదిలీ చేశారు. మాదాపూర్‌ డీసీపీ(ఎస్‌వోటీ) డి.శ్రీనివాస్‌ను మేడ్చల్‌ జోన్‌ డీసీపీ(ఎస్‌వోటీ)గా బదిలీ చేశారు.

పదోన్నతి పొందిన అదనపు డీసీపీలు వీళ్లే..
కె.గుణశేఖర్‌ – మేడ్చల్‌ డీసీపీ (ట్రాఫిక్‌)
జి.నరసింహారెడ్డి – రాచకొండ డీసీపీ ( స్పెషల్‌ బ్రాంచ్‌)
ఎస్‌.మల్లారెడ్డి – రాచకొండ డీసీపీ (ట్రాఫిక్‌)
మద్దిపాటి శ్రీనివాస రావు – సీఐడీ ఎస్పీ
పి.శోభన్‌ కుమార్‌ – మాదాపూర్‌ డీసీపీ(ఎస్‌వోటీ)
టి. సాయి మనోహర్‌ – మాదాపూర్‌ డీసీపీ (ట్రాఫిక్‌)
డి.రమేశ్‌ – ఎస్పీ (ఇంటెలిజెన్స్‌)
జే.చెన్నయ్య – ఐసీసీసీ హైదరాబాద్‌ ఎస్పీ
పి.విజయ్‌కుమార్‌ – సీఐడీ ఎస్పీ
కె.మనోహర్‌ – రాచకొండ డీసీపీ (రోడ్‌ సేఫ్టీ)
డి.శ్రీనివాస్‌ – మేడ్చల్‌ డీసీపీ (ఎస్‌వోటీ)
పి.కరుణాకర్‌ -(డీజీపీకి రిపోర్ట్‌)

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This