Friday, October 3, 2025
spot_img

4కె క్యుఎల్ఈడి డిస్‌ప్లే టెక్నాలజీతో ఆకాయ్ ఇండియా టీవీలు

Must Read

నగరాల్లోని ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఆకాయ్ ఇండియా తెలంగాణ, ఏపీలో పెద్ద సైజు టీవీలను విడుదల చేసింది. ఈ టీవీల్లో ఆండ్రాయిడ్ 11తో నడుస్తున్న ఈ సిరీస్‌లో అధునాతన 4కె క్యుఎల్ఈడి డిస్‌ప్లే టెక్నాలజీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సౌండ్ ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం సినిమా లాంటి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని ఈ టీవీలు అందిస్తాయి. ఈ సంధర్బంగా ఆకాయ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ శర్మ మాట్లాడుతూ, శక్తివంతమైన ధ్వని , గూగుల్ టీవీ యొక్క స్మార్ట్ సామర్థ్యాలతో అసాధారణమైన ప్రదర్శన పనితీరును ఈ సిరీస్ అందిస్తుందని తెలిపారు. భారతదేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ లో కస్టమర్స్‎లకు టెలివిజన్ టెక్నాలజీ అందించే అత్యుత్తమ ఆవిష్కరణలను తీసుకురావడానికి అకాయ్ యొక్క నిబద్ధతను సూచిస్తాయని తెలిపారు. ఈ టీవీలు స్థానికంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్,డీలర్లు, పంపిణీదారుల విస్తృత నెట్‌వర్క్ ద్వారా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కస్టమర్‌లు నెలకు రూ. 5,555 తో పైన్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్.డి.బి,టీవీఎస్ క్రెడిట్, హెచ్‎డిఎఫ్‎సీ, ఐడిఎఫ్‎సీ నుండి ఈఎంఐలను పొందవచ్చని వెల్లడించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This