Friday, September 20, 2024
spot_img

ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

Must Read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది.మంగళవారం సాయంత్రం అయిన ఢిల్లీకి వెళ్లారు.రాత్రి కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చించారు.గత ఐదేళ్లలో ఏపీ ఆర్థిక పరిస్థితి విధ్వంసానికి గురైందని తెలిపారు.అవినీతి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు పేర్కొన్నారు.ఈ సందర్బంగా నాలుగు శ్వేతాపత్రాలను అమిత్ షాకు వివరించానని చంద్రబాబు తెలిపారు.బుధవారం ఉదయం సీఎం అధికారిక నివాసం జన్‌పథ్లో పూజలు నిర్వహించారు.అనంతరం ఢిల్లీ నుండి విజయవాడ కు తిరిగి ప్రయాణమయ్యారు.ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్,కేంద్ర మంత్రులు కే. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్,ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు,కేశినేని చిన్ని ఉన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This