Saturday, October 4, 2025
spot_img

జమిలి ఎన్నికలకు కేంద్రం ఆమోదం,స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ

Must Read

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు.ఈ విధానం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు.రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని ఆరోపించారు.ప్రధాని మోదీ,అమిత్ షాకు తప్ప,ఎవరికి బహుళ ఎన్నికలు సమస్య కాదని తెలిపారు.ఈ నిర్ణయం పై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.మాజీ రాష్ట్రపతి రామ్‎నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.జమిలి ఎన్నికలకు సంబధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టె అవకాశముంది.ఎన్డీఏ హయంలోనే జమిలి ఎన్నికలు అమలుచేసి చూపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This