Friday, September 20, 2024
spot_img

ఢిల్లీ రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పిలుపు..

Must Read
  • జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి
  • ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ వెళ్లనున్న జీవన్ రెడ్డి
  • తనకి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలోకి ఎలా
    చేర్చుకుంటారంటూ మనస్థాపానికి గురైన జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి జీవన్ రెడ్డికి ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని కోరారు.ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.కనీసం తనకి సమాచారం ఇవ్వకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు.తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొనసాగుతానని తెలిపారు.జీవన్ రెడ్డి మనస్థాపం చెందడంతో మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు అయినతో మాట్లాడారు.మరికొంత మంది నాయకులు కూడా జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This