Friday, September 20, 2024
spot_img

కేటీఆర్ కి బండిసంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

Must Read
  • ఇన్నాళ్ల తర్వాత కేటీఆర్ కి నేతన్నలు గుర్తొచ్చారా
  • 15 ఏళ్లుగా సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించారు
  • బీఆర్ఎస్ హాయంలోనూ ఆకలి చావులు కొనసాగాయి
  • కేటీఆర్ రాసిన లేఖకు బండిసంజయ్ కౌంటర్

ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖకు కేంద్రమంత్రి బండిసంజయ్ కౌంటర్ ఇచ్చారు.ఇన్నాళ్ళ తర్వాత కేటీఆర్ కు నేతన్నలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు.సిరిసిల్లకు 15 ఏళ్లుగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహించారని,వారి హాయంలోనూ ఆకలి చావులు కొనసాగాయని విమర్శించారు.నేతన్నలను సంక్షోభం నుండి ఎందుకు గట్టెక్కించలేకపోయారని నిలదీశారు.బతుకమ్మ బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా చేశారని తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రకటించినప్పుడు సిరిసిల్ల గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.సిరిసిల్ల నేతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This