కేరళలోని వయనాడ్ ఘటన బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ ముందుకు వచ్చారు.రూ.కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు.రామ్ చరణ్ తో కలిసి ఈ విరాళాన్ని అందిస్తున్నామని చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు.వయనాడ్ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు.వారికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను,రామ్ చరణ్ తో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.కోటి రూపాయల సహాయాన్ని అందిస్తున్నామని,బాధలో ఉన్న కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు వయనాడ్ బాధితులకు తమవంతుగా సహాయం చేస్తున్నారు.