Monday, March 31, 2025
spot_img

ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు :కేటీఆర్

Must Read

ప్రభుత్వం చేస్తున్న అవినీతిని పై ప్రశ్నింస్తున్నందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ పై కేసు నమోదు చేశారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్.మంగళవారం కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ పై కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్ 122,126 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కరీంనగర్ పరిషత్ సమావేశంలో పాడికౌశిక్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ ని అడ్డుకున్నారు.దింతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.పోలీసులు పాడి కౌశిక్ పై కేసు నమోదు చేశారు.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు.బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడరని తెలిపారు.కేవలం ప్రతిపక్షాలను బెదిరించాలనే ఉద్దేశ్యంతోనే కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రశ్నించే నాయకుల పైన కేసులు పెట్టడం ప్రజా పాలననా అని ప్రశ్నించారు.ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేశారని విమర్శించారు.బీఆర్ఎస్ కార్యకర్తల పైన,మీడియా పైన అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని,ఇందిరమ్మ పాలనా అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS