- పిసిసి అబర్వర్ల సమావేశంలో మీనాక్షి వెల్లడి
- సమావేశానికి రానివారి పేర్లు తొలగింపు
కాంగ్రెస్ పార్టీ పదవుల్లో సీనియర్లకు పెద్ద పీట వేయనున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ విూనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్ లో పీసీసీ అబ్జర్వర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 70 మంది అబ్జర్వర్లను ఆహ్వానించగా.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితోపాటు మరో ఐదుగురు రాలేదు. దీంతో వారని ఆ పదవి నుంచి తొలగించారు. అదే విధంగా విూటింగ్ కు ఆలస్యంగా వచ్చిన వారిపైనా వేటు పడింది. 2017 నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మండల, బ్లాక్ అధ్యక్షుల నియామకం కోసం జిల్లాకు ఇద్దరు అబ్జర్వర్లను నియమిస్తున్నట్టు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ విూనాక్షి నటరాజన్ తెలిపారు. ప్రతి మండలం నుంచి పార్టీ మండలాధ్యక్ష పదవి కోసం ఐదుగురి పేర్లను పంపాలని సూచించారు. అదే విధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మూడు పేర్లను పీసీసీకి పంపాలని అబ్జర్వర్లకు విూనాక్షి నటరాజన్ సూచించారు. పార్టీ నాయకత్వంలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి చాలా చరిత్ర ఉందని, బ్రిటీష్ వాళ్లతో పోరాటం చేసిందని అన్నారు.
కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, జాతీయ స్థాయి ఆలోచనలతోనే ముందుకు పోతుందని అన్నారు. గాంధీ సిద్ధాంతాలతోనే పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. పార్టీ సిద్ధాంత ప్రచారం, సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచి జరగాలని అన్నారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గుజరాత్ మోడల్ గా చేపట్టాలని అధినాయకత్వం నిర్ణయించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విస్తారంగా జనంలోకి పోవాలని అన్నారు. సిద్ధాంత పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలోనే మొదటి సరిగా తెలంగాణ లో కులగణన, 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చరిత్రాత్మకమని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు జరగనున్నాయని ప్రకటించింది.



ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ విూనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ పార్టీ జాతీయ స్థాయి ఆలోచనలతో పార్టీ పని చేస్తుంది.. పార్టీ సిద్ధాంత ప్రచారం, సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచి జరగాలి అని సూచనలు చేసింది. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చాలా చిత్తశుద్ధితో సీరియస్ గా పని చేయాలని హెచ్చరించింది. ఈ దేశంలోనే మొదటి సరిగా తెలంగాణలో కుల గణన చేసి 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. అలాగే, దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.. అయితే, దేశంలో మోడీ సర్కార్, గత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపట్టింది.. ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అని విూనాక్షి నజరాజన్ పేర్కొన్నారు.